Telegram Channel
Join Now
వర్షాల నేపథ్యంలో గోదావరిలో నీటి ప్రవాహం పెరగగా, రామన్నగూడెం వద్ద కరకట్ట కోతకు గురవుతోంది. దీంతో ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీర ప్రాంత గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏటూరు నాగారం మండలంలోని బెస్త వాడ, ఎస్సీ కాలనీ, రామన్నగూడెం, కొత్తూరు, బుట్టాయిగూడెం; మంగపేట మండలంలోని పోదూరు, అక్కినపల్లి, కమలాపూర్, వాడగూడెం, రమణక్కపేట, కత్తిగూడెం, గుడ్డేలుగుల పల్లి, మంగపేట, బోర్ నర్సాపూర్ గ్రామాలను తరచూ వరదలు వణికిస్తుండగా, కరకట్ట కోతకు గురవుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.