భారీవర్షాలు, వరదలు కారణంగా శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 96 మండలాల్లో 525 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయని, మరో 230 గ్రామలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. ప్రస్తుత ప్రాథమిక నివేదికల ప్రకారం వ్యవసాయం 43,234 హెక్టార్లు, హార్టీకల్చర్ 2728.45 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. గోదావరి,కృష్ణాతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో నదుల్లో వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలువలు, కల్వర్టులకు, పడిపోయిన విద్యుత్ స్తంభాలకు, లైన్లకు దూరంగా ఉండాలన్నారు. వరద నీటిలో ప్రయాణాలు చేయరాదన్నారు.