ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలు కూడా ముందుగా ఉండే కాండ్రిక, పాయకపురం వంటి ప్రాంతాల వరకు వెళ్తున్నాయి. శివారు ప్రాంతాలకు వెళ్లటం లేదు. విజయవాడలోని ఉడా కాలనీ, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరి నగర్, ఎల్బిఎస్ నగర్, వాంబే కాలనీ, మధురా నగర్, అయోధ్య నగర్, రామకృష్ణాపురం, కొత్త రాజరాజేశ్వరిపేట, పాత రాజరాజేశ్వరి పేట, పైపుల రోడ్డు, శాంతి నగర్, ప్రశాంతి నగర్, జక్కంపూడి, పాతపాడు, పి.నైనవరం, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్టు, వించిపేట, భవానీపురం, హెచ్బీ కాలనీ, విద్యాధరపురం ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం కాస్తా జాప్యం జరుగుతోంది. అయితే ఇదే అదునుగా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ధరలను పెంచి అమ్ముతున్నారు.