అప్పటికే మద్యం తాగి ఉన్న పెద్ద నాన్న ఆ చిన్నారిపై పెన్ననది ఒడ్డున అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. అక్కడే పెన్నానది ఇసుక మేటల్లో ఆ చిన్నారిని పూడ్చి పెట్టి ఏం తెలియని వాడిలా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇంటి నుంచి బాలికతో కలిసి వెళ్లిన గంగాధర్ ఇంటికి ఒక్కడే రావడంపై కుటుంబ సభ్యులు చిన్నారి కోసం గంగాధర్ను నిలదీశారు. అయితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి… హిందూపురం రూరల్ పోలీస్స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే చిన్నారిని హత్య చేసి, ఇసుక మేటలో పూడ్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపించాడు. అడిషనల్ ఎస్పీ విష్ణువర్ధన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీఎస్డీటీ హారతి, హిందూపురం రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు.