ఈ క్రమంలో.. లావణ్య, మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. వీడియోలు తీస్తున్న లావణ్యపై మాల్వీ దాడికి దిగిందంటూ లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేసి.. హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో సహజీవనం చేస్తున్నాడు అంటూ లావణ్య ఆరోపిస్తోంది. ఇద్దరూ కలిసి.. ముంబైలో రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి ఇద్దర్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్తోంది. తన రాజ్ను తనకు అప్పగించాలని మాల్వితో గొడవకు దిగింది. అయితే.. ఈ గొడవ తర్వాత.. మాల్వీ తనపై దాడి చేసి.. తిరిగి తనపైనే కేసు పెట్టేందుకు వెళ్లిందంటూ లావణ్య ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే.. లావణ్య ఫిర్యాదుతో విచారణ వేగవంతం చేసిన హైదరాబాద్ పోలీసులు.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని తేల్చిన పోలీసులు.. ఈ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్- లావణ్య కలిసి పదేళ్ల పాటు సహజీవనం చేశారని పోలీసులు తేల్చారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని నిర్దారణకు వచ్చారు. కాగా.. ఈ కేసులో రాజ్ తరుణ్ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. లావణ్య ఇంటిని కూడా సందర్శించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ కేసులో రాజ్ తరుణ్కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో.. రాజ్ తరుణ్ బెయిల్ రద్దయ్యే ఛాన్సులు ఉన్నాయి.
రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్.. నార్సింగి పోలీసు స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇద్దరూ కలిపి పదేళ్లు సహజీవనం చేశామని.. తనను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడంటూ.. ఆరోపించింది. అయితే… ఇప్పుడు తనను వదలేసి.. ముంబైకి చెందిన హీరోయిన్ మాల్వి మల్హోత్రతో ఉంటున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ లావణ్య మీడియా ముందుకు రావటంతో.. ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది.